Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లక్ష ‘బిజినెస్ మేన్’లతో... వినూత్న ప్రచారం
మహేష్ బాబు తాజా సినిమా 'బిజినెస్ మేన్' విడుదల సందర్భంగా అభిమానులు వినూత్న ప్రచారం మొదలు పెట్టారు. గాలి పటాలకు ఫేమస్ అయిన సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని 'బిజినెస్ మేన్' లోగోలు, మహేష్ బాబు ఫోటోలతో కూడిన లక్ష గాలి పటాల(కైట్స్)ను సంక్షేమ హాస్టల్స్, మురికి వాడల్లోని పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. మహేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు దిడ్డి రాంబాబు నేతృత్వంలో ఈ గాలి పటాల పంపిణీ జరుగుతోంది.
మహేష్ బాబు, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'బిజినెస్ మేన్' సినిమా రూపొందింది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్నారు. ముంబై మాఫియా, ఆయుధాల వ్యాపారం కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి థమన్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి విజయం సాధించింది.
భాయ్(డాన్)కావాలనే లక్ష్యంతో హీరో ముంబై చేరుకుంటాడు. దావూద్, ఇతర డాన్లు సిటీని విదిలిపెట్టిన తర్వాత ముంబైలో డాన్ లేడని ఫీలయ్యే యువకుడు, డాన్ గా ఎలా ఎదిగాడు అనే పాయింట్ ను ఈ సినిమా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 13న బిజినెస్ మేన్ సినిమా తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 2 వేల షోలతో గ్రాండ్గా విడుదలవుతోంది.