థండర్ చాలెంజ్ విజేతలతో మహేష్ బాబు (ఫోటోస్)
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ సోమవారం సందడి చేసారు. థమ్సప్ థండర్ చాలెంజ్ లో విజేతలను ఆయన కలిసి అభినందించారు. గత పదేళ్లుగా మహేష్ బాబు థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ...తనకు ప్యారడైజ్ బిర్యాని అంటే చాలా ఇష్టమని తెలిపారు. థమ్సప్ థండర్ చాలెంజ్ అనేది గొప్ప కార్యక్రమం అన్నారు. తుఫాని స్టార్లతో పాటుగా వీర్స్ ను కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. థమ్సప్ చాలెంజ్కు సంబంధించిన వీడియోలు చూసానని, పోటీ దారులు సాహసోపేతమైన పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారంటూ వారిని అభినందించారు.
థమ్సప్ థండర్ చాలెంజ్ లో తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 15వేల మంది పాల్గొన్నారు. ఇందులో మిలటరీ ట్రైనింగును తలపించేలా పలు సాహసకృత్యాలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 45 మంది విజేతలుగా నిలిచారు. వీరికి మహేష్ బాబును కలిసే అవకాశం కల్పించారు నిర్వాహకులు.

మహేష్ బాబు
థమ్సప్ థండర్ చాలెంజ్ విజేతలతో కలిసి మహేష్ బాబు.

పదేళ్లుగా
గత పదేళ్లుగా థమ్సప్ తో అసోసియేట్ అయ్యానని, ఇది గ్రేట్ ఆపర్చ్యునిటీ అని మహేష్ బాబు తెలిపారు.

ప్యారడైజ్ బిర్యానీ ఇష్టం
తనకు ప్యారడైజ్ బిర్యాని అంటే చాలా ఇష్టమని మహేష్ బాబు తెలిపారు.

థమ్సప్ థండర్ ఛాలెంజ్
థమ్సప్ థండర్ చాలెంజ్ అనేది గొప్ప కార్యక్రమం అన్నారు. తుఫాని స్టార్లతో పాటుగా వీర్స్ ను కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications