Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ ఒక్కరిని, రామ్ చరణ్ ఏడుగురిని
ఏమిటీ ఒక్కటి, ఏడుగురు లెక్క అనుకుంటున్నారా..ఈ స్టార్ హీరోలు ట్విట్టర్ లో ఫాలో అయ్యే వ్యక్యుల సంఖ్య. వీళ్లిద్దరినీ లక్షల మంది అభిమానులు ఫాలో చేస్తూంటే..కేవలం మహేష్ ఒక్కరినే ఫాలో చేస్తారు. అలాగే రామ్ చరణ్ ..తన సర్కిల్ లోని ఏడుగురిని ఫాలో చేస్తాడు. వాళ్లెవరంటే...రాజ్ కుమార్ హిర్వాణి ,దలైలామా, సచిన్ టెండూల్కర్, శిరీష్ అల్లు, షాజన్ పదాంసి, రానా దగ్గుపాటి, జెనీలియా. ఇక మహేష్ బాబు ఫాలో అయ్యేది గల్లా జయ్ ఒక్కరిని మాత్రమే.
ఇక మహేష్ ప్రస్తుతం తన తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి అంటే జనవరి 13 వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రం తన కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందని భావిస్తున్నాడు. క్రితం సంవత్సరం దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ ఈ సంవత్సరం బిజినెస్ మ్యాన్ తో బిజినెస్ అంచనాలును తారుమారు చేసేటట్లు ఉన్నారు. అలాగే రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన తన దృష్టి మొత్తం తాజా చిత్రం రచ్చపైనే పెట్టారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తనకు పూర్తి యాక్షన్ ఇమేజ్ తెచ్చే మాస్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని భావిస్తున్నాడు.