Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కృష్ణ, మహేష్ బాబు, గౌతం కలిసి నటిస్తున్నారు...
హైదరాబాద్: ఆ మధ్య అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాలు నటులు ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కలిసి ‘మనం' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అందరూ ఒకే సినిమాలో కలిసి నటించడం, సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు.
ఘట్టమనేని ఫ్యామిలీ నటులైన కృష్ణ, మహేష్ బాబు, గౌతం కలిసి నటించాలని అభిమానులు చాలా కాలంగా ఆశ పడుతున్నారు. ఎట్టకేలకు వారి ఆశ తీరబోతోంది. ఈ ముగ్గురు స్టార్స్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీ శ్రీ' అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు, గౌతం గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో కృష్ణ రెండో భార్య విజయ నిర్మల, విజయ నిర్మల తనయుడు నరేష్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ లీడ్ చేస్తున్న సినిమా శ్రీ శ్రీ. స్వయంగా కృష్ణ మహేష్ బాబుతో మాట్లాడి ఆయన్ను ఒప్పించారట. అయితే ఈ విషయమై ఇంకా అపీషియల్ సమాచారం ఏమీ లేదు.
గతంలో దర్శకుడు ముప్పలలేని తాజ్ మహల్, రాజా, సంక్రాంతి లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా పగ ఎప్పటికి పాతది కాదు అన్న కథాంశంతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.