Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
క్రిష్ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్
దూకుడు మీద ఉన్న మహేష్ బాబు మరో కథను ఓకే చేసారు. వేదం, గమ్యం చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ఆయన కమిటయ్యారు. ఈ చిత్రం కథ,మహేష్ పాత్ర చాలా వాస్తవకింగా, ఇప్పటివరకూ మహేష్ చేయని రీతిలో బాడీ లాంగ్వేజ్ తో ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అయితే సుకుమార్ తో మహేష్ చిత్రం ఫినిష్ అయ్యాక ఈ చిత్రం చేస్తారు. ఈ లోగా క్రిష్ కూడా రానాతో తాను 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రాన్ని పూర్తి చేస్తారు. ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తారు.ఈ నెల 27 నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. హీరోయిన్ ఇంకా ఎంపిక చేయలేదు.
ఇక మహేష్ ప్రస్తుతం ప్రస్తుతం 'బిజినెస్మేన్' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం డైలాగుతో కూడిన టీజన్ ని విడుదల చేసారు. ఆ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక బిజెనెస్ మ్యాన్ అనంతరం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో నటిస్తున్నారు. మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో ఈ చిత్రం మల్టి స్టారర్ చిత్రంగా రూపొందనుంది. ఈ చిత్రం ఆల్రెడీ లాంచింగ్ జరిగింది. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ ఐదున ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంతను ఎంపిక చేసారు.