Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్టీఆర్ బయోపిక్లో మహేష్ బాబు కూడా నటిస్తున్నారు: శ్రీరెడ్డి
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ గురువారం నాచారంలోకి రామకృష్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ చిత్రంలో రామారావు పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ కనిపించనున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నారట. ఈ విషయాన్ని నటి శ్రీరెడ్డి వెల్లడించారు. దర్శకుడు తేజ స్వయంగా తనతో ఈ విషయం చెప్పారని ఆమె తెలిపారు.
కాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో మీడియాకెక్కి సంచలనంగా మారిన శ్రీరెడ్డికి ఎన్టీఆర్ బయోపిక్లో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆనందాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ.... బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి గొప్ప యాక్టర్లు చేస్తున్న సినిమాలో తనకు అవకాశం దక్కడం హ్యాపీగా ఉందన్నారు. అయితే మహేష్ బాబు ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు అనేది హాట్ టాపిక్ అయింది.
'యన్.టి.ఆర్ ... అనే టైటిల్తో ఈ బయోపిక్ తెరకెక్కుతోంది. బాలకృష్ణ కూడా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. ఎన్.బి.కె.ఫిలింస్ బ్యానర్పై వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో జరిగిన బయోపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో...... 'దానవీరశూరకర్ణ' సినిమాలో దుర్యోధనుడు గెటప్లో ఉన్న బాలకృష్ణపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. తొలి సన్నివేశానికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు క్లాప్ కొట్టారు. తెలంగాణ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. కె.రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ, సాయికృష్ణ స్క్రిప్ట్ను దర్శక నిర్మాతలకు అందించారు.