Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అవార్డులపై మహేష్ బాబు హ్యాపీ...
హైదరాబాద్: దూకుడు చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుకు ఎంపిక కావడంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంది అవార్డు దక్కడం సంతోషకర విషయమని.... దూకుడు చిత్ర యూనిట్ సమిష్టి కృషి వల్లనే సినిమా ఇన్ని అవార్డులు దక్కాయన్నారు. సినిమా ఇంత హిట్ కావడానికి, ఇన్ని అవార్డులు దక్కడానికి దర్శకుడు శ్రీను వైట్ల ప్రధాన కారణమన్నారు.
దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ....దూకుడు చిత్ర యూనిట్ సభ్యులకు, ఈ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్కు కంగ్రాట్స్ తెలిపారు. సూపర్ స్టార్ మహేష్, సూపర్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో జీ.రమేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచెంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన 'దూకుడు' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 11-11-11కి 50 రోజులు పూర్తి చేసుకున్న 'దూకుడు' 47 రోజులకే రూ. 101 కోట్లు కలెక్ట్ చేసింది. అవార్డులు పరంగా కూడా ఈ చిత్రం సంచలనం సృష్టించడం గమనార్హం.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకీ సరసన అంజలి నటిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెతో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా పరిచయం కాబోతోంది. మహేష్తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అక్టోబర్ 10 నుండి గోవాలో షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఇందుకోసం అయన అమెరికా నుండి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా తెచ్చుకున్నారు. 2013 వేసవికి ఈ మూవీ విడుదల కానుంది.