Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
శ్రీను వైట్ల స్క్రిప్టు చదివిన మహేష్ ఏమంటున్నాడంటే...
శ్రీను వైట్ల కలిసాడు. అతని క్లారిటీ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. గ్యారెంటీ బ్లాక్ బస్టర్ చిత్రం వస్తుందనిపించింది. స్క్రిప్టు అయితే రాకింగ్. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు మహేష్ బాబు. మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో త్వరలో ప్రారంభంకానున్న దూకుడు చిత్రం గురించిన ట్వీట్ ఇది. ఈ చిత్రంలో మహేష్ సినిమా మొత్తం ఫోలీస్ ఆఫీసర్ గా కనిపస్తూ నవ్విస్తారు. గోపీమోహన్ అందించిన ఈ కథకి కోన వెంకట్ డైలాగులు రాస్తున్నారు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. వారు ఇంతకుముందు శ్రీను వైట్ల, వెంకటేష్ కాంబినేషన్ లో నమో వెంకటేశ చిత్రం రూపొందించారు.
ఇక మహేష్, సమంతల మీద ఓ పాటని చిత్రీకరించటంతో సినిమా ప్రారంభమవుతుంది. ఇక ఈ పాటకి లొకేషన్ గా గుజరాత్, అలాంగ్ లోని ఎంపిక చేసారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. శ్రీను వైట్ల తన పొటిన్షియల్ మొత్తం వినియోగించి మంచి చిత్రాన్ని రూపొందిస్తానని చెప్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల తన కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తున్నాడు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు.