Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేశ్ కొత్త సినిమా అతిథి
తెలుగు సినిమాలలో అన్ని ప్రమాణాలలో ఎన్నదగిన మంచి చిత్రాలు పదింటిలో మహేశ్బాబు, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ఒక్కడు సినిమా ఉంటుంది. అదే మహేశ్బాబు, పూరీ జగన్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి చిత్రం తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ నేపథ్యంలో తాజాగా ముస్తాబవుతున్న చిత్రం - సైనికుడు. మహేశ్బాబు, త్రిష జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ సినిమాల సృష్టికర్త వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. గుణశేఖర్, మహేశ్ - ఒక్కడు, అర్జున్ చిత్రాల తరువాత కలిసి చేస్తున్న మూడో చిత్రం ఇది.
సైనికుడు చిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు జరుగుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మణిశర్మ సంగీతం, వేటూరి సాహిత్యం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు. చిన్న చిత్రమైనా భారీగా సెట్టింగులు వేయించే దర్శకుడు గుణశేఖర్ ఈసారి కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా అద్భుతాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, మహేశ్బాబు డైరీ మరో రెండేళ్ల పాటు నిండిపోయింది. ఆయన తదుపరి చిత్రం కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై అన్నయ్య రమేశ్బాబు నిర్మిస్తున్నారు. అతనొక్కడే, అశోక్ చిత్రాల దర్శకుడు సురేందర్రెడ్డి తన స్టయిల్లో ఒక పవర్ఫుల్ సబ్జెక్టు రెడీ చేశారు. ఈ చిత్రానికి అతిథి అనే టైటిల్ కూడా రిజిష్టర్ చేశారు. సైనికుడు చిత్రం పూర్తయిన తర్వాత మహేశ్బాబు చేయబోయే చిత్రం ఇదే కావచ్చు.