twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సింహాసనం' రీమేక్ లో మహేష్?

    By Staff
    |

    Mahesh Babu
    అప్పట్లో కృష్ణ ద్వి పాత్రల్లో నటించగా ఘనవిజయం సాధించిన సింహాసనం చిత్రం మహేష్ బాబుతో రీమేక్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ మధ్య రాజమౌళి తన తాజా చిత్రం ధీరుడు కోసం సింహాసనం సెట్స్ వాడుకోవటానికి ఫర్మిషన్ అడిగితే కృష్ణ నిరాకరించి ఆ సినిమా రీమేక్ చేసే ఆలోచన వివరించాడని సమచారం. ఇక ఈ సినిమా రిలీజైన నాటినుండి ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఆ సెట్స్ ని వేరే చిత్రాల షూటింగ్ కి అనుమతించలేదు. అలాగే పధ్మాలయాలో ఉన్న వాటికి పాడవకుండా అప్పుడప్పుడూ సంస్కరిస్తారని ఆ స్టాఫ్ చెప్తున్నారు.

    ఇంతకాలం కృష్ణ తనకు ఘనవిజయం ఇచ్చిన చిత్రం గుర్తుగా ఆ సెట్స్ పై మక్కువ పెంచుకున్నారని అనుకున్నవారంతా ఈ ప్రపోజల్ విని ఆశ్చర్యపోతున్నారు. మరి ఎప్పుడు ప్రారంబించుదామనుకుంటున్నారు...అంటే ఆయన నవ్వి ఊరుకున్నారుట. అలాగే రామ్ చరణ్ చేస్తున్న సినిమా కూడా నాలుగు వందల సంవత్సరాల క్రిందట వాతావరణం క్రియేట్ చేసి సంచలనం సృష్టించే యోచనలో ఉంది. అది కనుక సక్సెస్ అయితే సింహాసనం ప్రారంభించే అవకాశం ఉంది. ఏమో రాజమౌళీనే ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారేమో.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X