ఆ సాంగ్ లో అంత 'ఖలేజా' లేదు.. మళ్లీ ట్యూన్ చేయండి...
ఫ్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజా టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. అయితే ఓ పాట చిత్రీకరణ విషయంలో మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ రాజీ పడటం లేదు. సిట్యువేషన్ కు తగ్గట్టు గా ట్యూన్ రాలేదని సంగీత దర్శకుడు మణిశర్మకు మళ్లీ మళ్లీ పనిపెడుతున్నట్లు భోగట్టా. మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి సన్నివేశాన్ని ఎంతో సీరియస్ గా తీసుకుని తెరకెక్కించినట్లు సమాచారం.
కాగా ఈ చిత్రానికి నిర్మాతలు సి. కల్యాణ్, సింగనమల రమేష్ లు. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు.
More from Filmibeat
మహేష్ బాబు అనుష్క ఖలేజా సి. కల్యాణ్ సింగనమల రమేష్ mahesh babu anushka khaleja c kalyan singanamala ramesh


Click it and Unblock the Notifications











