Don't Miss!
- News దళపతి విజయ్ కారు ధ్వంసం చేసిన అభిమానులు.. ఎందుకో తెలిస్తే షాక్!!
- Technology Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
ఎన్టీఆర్ చేసిన తప్పు చేయనంటున్న మహేష్
ఒకరి తప్పులు..మరొకరకి పాఠాలు అవుతాయనేది మహేష్ విషయంలో నిజం అనిపిస్తోంది. మహేష్ బాబు తాజా చిత్రాన్ని మొదట తమిళంలోనూ విడుదల చేద్దామనే ప్రపోజల్స్ తో నిర్మాత,దర్శకులు ఉన్నారు. అయితే మహేష్ బాబు వెంటనే ఆ ప్రపోజల్ ని అపోజ్ చేసాడట.దానకి కారణం జూ.ఎన్టీఆర్ అంటున్నారు. ఎన్టీఆర్ తనకు తమిళంలోనూ మార్కెట్ రావాలనే ఉద్దేశ్యంతో ..తన భారీ బడ్జెట్ చిత్రం ..శక్తి ని ప్లానింగ్ లేకుండా ఒకేసారి విడుదల చేసాడు.దాంతో ఇక్కడా అక్కడా ఫెయిల్యూర్ అయింది.దాంతో మరోసారి ఎన్టీఆర్ సినిమా అక్కడ విడుదల అంటే తమిళ మార్కెట్లో కొంచెం కూడా క్రేజ్ రాకుండా పోయింది.అదే తమిళ దర్శకుడుతో సినిమా చేసి అక్కడా ఇక్కడా విడుదల చేసి డబ్బింగ్ సినిమా లా కాకుండా స్టైయిట్ సినిమాలా ఉంటుందని మహేష్ ఆలోచన. అందుకే మహేష్ తన సినిమాని మణిరత్నంతోకానీ, శంకర్ తో కానీ, కెవీ ఆనంద్,లింగు స్వామి, గౌతమ్ మీనన్ వంటి దర్శకులతో చేసి అక్కడ మార్కెట్ పై తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. ఆ తర్వాత తన సినిమాలు,తెలుగు..తమిళం కలిసి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తానని అంటున్నారు.అంతేగాక దూకుడు డబ్బింగ్ కన్నా, రీమేక్ రైట్స్ బాగా వస్తాయని నిర్మాతలను ఒప్పించాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.