Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘మహర్షి’ టీజర్ : మహేష్ బాబు కెరీర్లోనే ది బెస్ట్ అనేలా ఉంది
Recommended Video
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన 25వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై అభిమానులకు కనువిందు చేసింది. గురువారం ఉదయం 9.09 గంటలకు 'మహర్షి' టీజర్ రిలీజ్ చేశారు. స్టైలిష్గా నడుచుకుంటూ మహేష్ బాబు వెళుతున్న తీరు... ఆయన కెరీర్లోనే ది బెస్ట్ అనేలా ఉంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు రిషి అనే పాత్రలో కనిపించబోతున్నారు. చేతిలో ల్యాప్ టాప్ పట్టుకుని ఉండటం, పక్కన అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్లడం చూస్తుంటే ఆయన కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.
మహేష్ కెరీర్లో 25వ చిత్రం
మహేష్ బాబు కెరీర్లో ఇది 25వ చిత్రం. వంశీ పైడిపల్లి అద్భుతమైన కథతో రావడంతో తన ల్యాండ్ మార్క్ మూవీకి ఇదే కరెక్ట్ అని మహేష్ బాబు డిసైడ్ అయ్యాడు. రెండు సంవత్సరాల క్రితమే వంశీ ఈ కథను చెప్పగా... 25వ చిత్రంగా దీన్ని చేద్దామని చెప్పడంతో వంశీ కూడా ఓపికగా వెయిట్ చేశాడు.
ఎక్కడ చూసిన మహేష్ మయం
మహేష్ బాబు పుట్టినరోజు కావడం, అందులోనూ ఆయన సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ విడుదల చేయడంతో సోషల్ మీడియా మొత్తం మహేష్ మయం అయిపోయింది. తెలుగు సినిమా సెలబ్రిటీలతో పాటు అభిమానులు మహేష్ బాబును విషెస్తో ముంచెత్తారు.
లుక్ విషయంలో స్పెషల్ కేర్
ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కొత్తగా కనిపించడం కోసం చాలా కేర్ తీసుకున్నారు. ముంబై నుండి హెయిర్ స్టైల్ నిపుణులు వచ్చి మహేష్ బాబును మేకోవర్ చేశారు. హెయిర్ స్టైల్, గడ్డం, కాస్టూమ్స్ ఇలా ప్రతి విషయంలోనూ మహేష్ బాబు కొత్తగా కనిపిస్తున్నారు.
ముఖ్యపాత్రల్లో...
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానకి కేయూ మోహనన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మహర్షి
వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వై జయంతి మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. డెహ్రాడూన్, హైదరాబాద్, గోవాలలో ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.... 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.