Don't Miss!
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Finance Cerlec News: మీరూ మీ పిల్లలకు సెరెలాక్ ఆహారంగా ఇస్తున్నారా.? షాకింగ్ వార్త తెలుసుకోండి..
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
'మోస్ట్ డేంజరస్' లిస్ట్లో మహేష్, మిగతా హీరోలు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : తెలుగు సినిమాల్లో అత్యంత డేంజర్ సెలెబ్రిటి మాత్రం ప్రిన్స్ మహేశ్ బాబునేనని తేల్చి చెప్పారు. మోస్ట్ డిజైర్ బుల్ మ్యాన్ గా దేశంలో రెండవ ప్లేసులో నిలబడ్డ మహేష్ కు అభిమానులు అదే రేంజిలో ఉన్నారు. దాంతో సైబర్ క్రిమినల్స్ ఆయన పేరుని ఎక్కువగా ఇండియాలో వాడుకుంటున్నట్లు తేల్చి చేప్పారు.
వివరాల్లోకి వెళితే.... ప్రపంచంలో అతిపెద్ద సెక్యూరిటీ టెక్నాలజీ కంపెనీ మెకాఫీ పరిశోధనలో ఈ విషయం తేలింది. 2003 ఏడాదిలో స్పోర్ట్స్, రాజకీయాలు, సినిమా రంగాలకు చెందిన అత్యంత ప్రముఖులపై మెకాఫీ అధ్యయనం నిర్వహించింది. సైబర్ క్రిమినల్స్ తమకు కావాల్సిన సమాచారాన్ని సంగ్రహించేందుకు సెలెబ్రిటీల పేర్లను ఉపయోగించుకుంటున్నట్టు మెకాఫీ వెల్లడించింది.
ఇందులో భాగంగా హీరోల అభిమానుల్నికూడా వాడుకుంటున్నారు. అపరిచితుల్ని ఎరగా వేసి పాస్వర్డ్లు, కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక ప్రముఖుల చిత్రాలు, వీడియోలు, నగ్న చిత్రాలు చూడటానికి ఎక్కువ మంది మొగ్గు చూపినట్టు పరిశోధనలో వెల్లడైంది. '
భారత్లో సెలెబ్రిటీలను దేవుళ్ల మాదిరిగా ఆరాధిస్తారు. సైబర్ క్రిమినల్స్ మోసాలు చేయడానికి వారి పేర్లను వాడుకుంటున్నారు' అని మెకేఫీ ఇండియా సెంటర్ ఇంజనీరింగ్-కంజూమర్, మొబైల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ వెంకట సుబ్రమణ్యం చెప్పారు.
'మోస్ట్ డేంజరస్' విడుదల చేసిన లిస్ట్ లో సెలబ్రేటీలు స్లైడ్ షోలో...
మహేష్ బాబు
ఈ అధ్యయనంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న వన్ (నేనొక్కడినే) చిత్రం ట్రైలర్ను రెండు లక్షల మందికి పైగా వీక్షించారని తేలింది. దాంతో 43 సైట్స్ కు ఆన్ లైన్ లో సైబర్ క్రిమినల్స్ ఇన్ ఫెక్ట్ అయ్యేలా చేసారని తెలుసింది.
రామ్ చరణ్ ...
తదపరి రామ్చరణ్ తేజకు రెండో ర్యాంక్ దక్కింది. వన్ ట్రైలర్ తర్వాత రామ్చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన బాలీవుడ్ సినిమా 'జంజీర్'ను చూడటానికి నెటిజెన్లు ఎక్కువగా ఇష్టపడ్డారు. దాంతో 42 సైట్స్ కు ఆన్ లైన్ లో ఇన్ ఫెక్ట్ అయ్యింది.
పవర్ స్టార్ ...
పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'గబ్బర్సింగ్'కు మూడో ర్యాంక్ లభించింది. ఈ చిత్రం వీడియోలతో పాటు పవన్ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువగా మక్కువ చూపారు. పవనిజం అంటూ అభిమానులు క్రియేట్ చేసే పేజీలు,వెబ్ లింక్ ల ద్వారా 40 ఆన్ లైన్ సైట్స్ ఇన్ ఫెక్ట్ అయ్యింది.
అంజలి
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చిత్రంతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. ఆమె ప్రస్తుతం మసాలా చిత్రంలో మళ్లీ వెంకటేష్ సరసన చేస్తోంది. ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. 39 సైట్స్ కు ఆమెను ప్రమోట్ చెయ్యటంతో ఇన్ ఫెక్ట్ అయ్యింది.
ఇలియానా
ఇలియానా బాలీవుడ్ ఎంట్రీకూడా ఇవ్వటంతో ఆమెకు ఆన్ లైన్ లో ఓ రేంజి క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు ఆమె షాహిద్ కపూర్ తో చేస్తున్న చిత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. దాంతో సైబర్ క్రిమినల్స్ మొత్తం ఆమెను కూడా అడ్డం పెట్టుకుని వైరస్ లను నెట్ లలో ప్రవేశపెట్టడం వంటివి చేసారు. ఆమె కంటెంట్ వల్ల 36 సైట్స్ కు ఇన్ ఫెక్ట్ అయ్యింది.
ఎన్టీఆర్...
కాగా జూనియర్ ఎన్టీయార్ ప్రస్తుతం రామయ్యా వస్తావయ్యా చిత్రం చేస్తున్నారు. ఆయన పొలిటికల్ గా కూడా మంచి క్రేజ్ ఉంది. దాంతో ఆయన స్టేట్ మెంట్స్ కు, న్యూస్ కోసం ఎన్టీఆర్ ఉన్న న్యూస్ లు ఫోటోలు చూస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోవటంతో 35 సైట్స్ కు ఇన్ ఫెక్ట్ అయ్యింది.
అల్లు అర్జున్
టాలీవుడ్ లో స్టైల్ ఐకాన్ గా పేరుతెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం రేసు గుర్రం చేస్తున్నారు. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి వార్తలు చదవటానికి మెగా ఫ్యాన్స్ మొత్తం ఆసక్తి చూపుతున్నారు. దాంతో 34 సైట్స్ కు ఇన్ ఫెక్ట్ అయ్యింది.
అమలా పాల్
ఈ కేరళ కుట్టి ఇద్దరమ్మాయిలు చిత్రంతో ఒక్కసారిగా తెలుగులో హాట్ గా మారిపోయింది. తమిళంలోనూ ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఆమె అప్ డేట్స్ చూడ్డానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఆమె ఫోటోలు, న్యూస్ లు అడ్డం పెట్టుకుని 32 సైట్స్ కు ఇన్ ఫెక్ట్ అయ్యింది.
కృతి సనన్
మహేష్బాబు ‘1' ‘నేనొక్కడినే' చిత్రంలో లో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. దాంతో అందరి దృష్టీ ఆమెపైనే ఉంది. మహేష్ కు జోడీ కట్టే ఆమె ఎవరు..ఆమె ఫోటోలు ఏమిటి అంటూ అభిమానులు నెట్ సెర్చ్ చేస్తున్నారు. దాంతో ఆమె పేరుని అడ్డం పెట్టుకుని 30 సైట్స్ లలో సైబర్ క్రిమినల్స్ ఇన్ ఫెక్ట్ చేసారు.
కాజల్ అగర్వాల్
ఎన్టీఆర్ సరసన బాధ్షా లో చేసిన కాజల్ అగర్వాల్ కూడా మోస్ట్ డేంజరస్ సెలబ్రేటీల లిస్ట్ లో స్దానం సంపాదించుకుంది. ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం, తమిళంలోనూ క్రేజ్ ఉండటంతో ఆమె పై వచ్చే న్యూస్ లకు ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. దాంతో ఆన్ లైన్స్ సైట్స్ లో 29 కి సైబర్ క్రిమినల్స్ ఆమె పేరు అడ్డం పెట్టుకుని టార్గెట్ చేసారు.