twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐదేళ్లు ఎదురుచూసా: మహేష్ బాబు

    By Srikanya
    |

    ''పోకిరి' తరవాత పూరి జగన్నాథ్‌తో ఏ సినిమా చేసినా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయని తెలుసు. అందుకే కథ కోసం ఐదేళ్లు ఎదురుచూశా. నా నిరీక్షణకు తగిన ఫలితం వచ్చింది'' అని మహేష్ బాబు అన్నారు. మహేష్ చిత్రం 'బిజినెస్ మేన్' చిత్రం నేటితో(మార్చి 2) 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే 'జగన్‌ నా పాత్రని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. సంభాషణలు కూడా కొత్తగా ఉన్నాయి. అందుకే ఇంత ఆదరణ లభించింది. 'బిజినెస్‌మేన్‌ 2'తో మా కలయిక హ్యాట్రిక్‌ అందుకొంటుందనే నమ్మకం ఉంది''అన్నారు. ఇక ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

    తమ చిత్రం 350 సెంటర్లలో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకోబోతోందని ఆ చిత్ర కో ప్రొడ్యూసర్ వి. సురేష్ రెడ్డి తెలిపారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్‌కు మహేష్ బాబు, ఆయన అభిమానులు భారీ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. త్వరలో మా సంస్థ నుంచి బిజినెస్ మేన్ 2 చిత్రం రాబోతోందని తెలిపారు. మహేష్ బాబు, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బిజినెస్ మేన్' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. రెండు వేలకు పైగా థియేటర్లలో విడుదల చేసిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. మహేష్ బాబు కెరీర్లోనే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో హైయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. దిల్ రాజు ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Mahesh ‘businessman’ completed 50 days of run in 350 Centers and is moving towards 100 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X