Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
నిజమా? మహేష్ బాబు గురించి హాట్ న్యూస్
హైదరాబాద్: టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ టాప్ యాక్టర్లలో మహేష్ బాబు పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేసి అభిమానులను అలరించారు. అయితే ఆయన ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ ద్విపాత్రాభినయం చేయలేదు.
తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో మహేష్ బాబు డబల్ యాక్షన్ చేయబోతున్నారని వినికిడి. ఈ విషయం ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.
ఈ చిత్రం ఈ ఆగస్టు 11న పద్మాలయ స్టూడియోలో గ్రాండ్గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు లేకుండానే షూటింగ్ మొదలైంది. మహేష్ బాబు లేని సీన్లను సపోర్టింగ్ యార్టర్లతో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు 'ఆగడు' చిత్ర షూటింగులో భాగంగా యూరఫ్ వెళ్లారు. అక్కడ షూటింగ్ ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత కొరటాల శివ ప్రాజెక్టులో జాయిన్ కాబోతున్నాడు.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇంకా ఈచిత్రానికి హీరోయిన్ కూడా ఫైనల్ కావాల్సి ఉంది. ఇప్పటికే పలవురి పేర్లు వినిపిస్తున్నా ఎవరూ ఫైనల్ కాలేదు. అన్నీ ఓకే అయిన తర్వాత వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.