Don't Miss!
- Sports సన్రైజర్స్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్కు గుడ్ న్యూస్
- Technology 32MP టెలిఫోటో కెమెరా, 8GB ర్యామ్ Oppo స్మార్ట్ఫోన్పై డిస్కౌంట్.. రూ.2999 తగ్గింపు సహా..!!
- Finance Banking News: ముసలోళ్లనూ వదలని మోదీ సర్కార్..! SBI తాజా రిపోర్ట్ వివరాలివే..
- News AP Election Survey: వైసీపీ వర్సెస్ కూటమి పోరులో మొగ్గు వారికే -తేల్చేసిన మరో జాతీయ సర్వే..!
- Automobiles చీరకట్టులో బైక్ రైడ్ చేసిన ప్రముఖ నటి.. మండిపడుతున్న నెటిజన్లు - ఎందుకంటే?
- Lifestyle ఫెయిర్నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
అమెరికా వెళ్లి ప్రమోట్ చేయనున్న మహేష్ బాబు
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు'(తాత్కాలిక టైటిల్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జులై 17 నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ చిత్రాన్ని అమెరికా వెళ్లి ప్రమోట్ చేయనున్నారట.
జులైలో అమెరికాలో జరిగే ప్రీమియర్ షోకి మహేష్ హాజరవుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. అదే సమయంలో ‘తానా'(తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సెలబ్రేషన్స్ కూడా ఉండటంతో మహేష్ బాబు ఈ వేడుకలకు కూడా హాజరవుతారని సమాచారం.
కాగా ఈ సినిమా బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని సమాచారం. రీసెంట్ గా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని అమ్మారని అదీ రికార్డు రేటుకు అని చెప్తున్నారు. క్లాసిక్ ఎంటర్నైమెంట్ వారు..ఈ రైట్స్ ని 8.1 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వినికిడి. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకు ఈ రేటు రాలేదు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ..అత్తారింటికి దారేది, మహేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలే ఎక్కువ రేట్ తో నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాయి. ఇప్పుడు తన రికార్డుని తనే మహేష్ బ్రద్దలు కొట్టుకున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు మల్టీ మిలియనీర్(ధనవంతుడు)గా కనిపించబోతున్నాడు. ఇందులో అతని లుక్, స్టైల్ పూర్తిగా డిఫరెంటుగా కనిపించబోతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఉగాదికి ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటిస్తోంది. జగపతి బాబు మహేష్ బాబు తండ్రి పాత్ర పోషిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నీ చిత్రానికి ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్, ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.