మహేష్ బాబు బంధువు మృతిపై అనుమానాలు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువు శాఖమూరి సూరి బాబు అనుమానాస్పద స్థితిలో విజయవాడలో మరణించారు. సూరి బాబు మృత దేహం పశువుల ఆసుపత్రి వంతెన వద్ద కాలువలో తేలిఉంది. ఇది ఆత్మ హత్యా? లేక అనుకోకుండా జరిగిన ప్రమాదమా? ఇంకేమైనా కారణం ఉందా? అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సూరి బాబు మృతి విషయం తెలుసుకున్న వెంటనే కృష్ణ కుటుంబం ఒక్క సారిగా దిగ్ర్భాంతికి గురైంది. కృష్ణ వెంటనే హుటా హుటిన సూరిబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయవాడ బయల్దేరినట్లు తెలుస్తోంది. విజయవాడలో మాత్రం సూరి బాబు మృతిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బంధువు కావడంతో పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. వీలైనంత త్వరగా ఆయన మృతి వెనక గల మిస్టరీని చేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ స్థాయి నుంచి ఈ కేసుపై దృష్టి పెట్టినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












