Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబు సరికొత్త హిస్టరీ.. గతంలో కనీవినీ ఎరుగని విధంగా
సూపర్ స్టార్ మహేష్ బాబు జోష్ కొనసాగుతోంది. వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్న మహేష్.. ఇటీవలే 'మహర్షి' సినిమా రూపంలో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మహేష్ బాబుతో పాటు ఆయన అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇంతలో మహేష్ బాబు పుట్టిన రోజు దగ్గరపడటంతో ఆయన కోసం ఓ వినూత్న గిఫ్ట్ రెడీ చేశారు ఫ్యాన్స్. ట్రెండ్కి తగ్గట్టుగా కొన్ని డీపీ రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. అదే డీపీ ఇప్పుడు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దామా..
మహేష్ అభిమానులకు పండగ రోజు
సాధారణంగా తమ అభిమాన హీరో పుట్టిన రోజంటే ఆ రోజు పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 9న మహేష్ అభిమానులు పండగ చేసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే కొన్ని రోజుల ముందు నుంచే మహేష్ పుట్టిన రోజు హైలైట్ అయ్యేలా డీపీని రూపొందించి దానిని వారి వారి సోషల్ మీడియా ఖాతాలకు డీపీలుగా పెట్టుకొని అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఆకట్టుకుంటున్న డీపీ
మహేష్ అభిమానులు రూపొందించిన ఈ డీపీ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇందులో మహేష్ నటించిన సినిమాల్లోని క్యారెక్టర్ పేర్లు పొందుపరిచారు. ముఖ్యంగా మహేష్ తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' లో మహేష్ క్యారెక్టర్ పేరు అజయ్ కృష్ణను బాగా ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ కొన్ని లక్షల సోషల్ మీడియా ఖాతాలకు డీపీలుగా వెలిసింది.
గతంలో కనీవినీ ఎరుగని విధంగా
గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఈ డీపీని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు నెటిజన్లు. ట్విట్టర్ వేదికగా కేవలం 18 గంటల్లోనే ఈ డీపీని 1.5 మిలియన్ల మంది షేర్ చేశారు. ఇలా ఓ పిక్ని ఇంత తక్కువ సమయంలో ఇంతలా రీ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో సరికొత్త హిస్టరీ.
మహేష్.. సరిలేరు నీకెవ్వరు
మహేష్ బాబు కెరీర్లో 26వ సినిమాగా రాబోతుంది 'సరిలేరు నీకెవ్వరు' సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.