Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'మా'కు సంబంధం లేదు, మహేష్ బాబే సొంతంగా.. ఊహించని షాక్కు కారణం అదేనా!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అమెరికాలో మహర్షి చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మా అసోసియేషన్ వారు మహేష్ ముఖ్య అతిధిగా నిర్వహించాలనుకున్నా ఓ ఈవెంట్ రద్దైన సంగతి తెలిసిందే. ఈవెంట్ రద్దు కావడానికి అనేక కారణాలు వినిపించాయి. ఎలాగూ మహేష్ అమెరికాలోనే ఉండడంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మా అసోసియేషన్ వారు భావించారు. మహేష్ ముఖ్య అతిధిగా ఈవెంట్ నిర్వహించి వచ్చిన నిధుల్ని మా అసోసియేషన్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగించుకోవాలనేది ప్లాన్.
ఆసక్తి చూపలేదు
ఈ ఈవెంట్ కు మొదట 2 వేల డాలర్ల వరకు టికెట్ ధర నిర్వహించారు. ఆశించిన స్పందన రాకపోవడంతో 400 డాలర్లకు తగ్గించారు. అయినా కూడా ఈ ఈవెంట్ కు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ కారణం వల్లనే కార్యక్రమాన్ని రద్దు చేసారని నిన్న వార్తలు వచ్చాయి.
అసలు కారణం ఇదే
తాజాగా నిర్వాహకులు ఈ ఈవెంట్ రద్దు కావడానికి గల కారణాలు వివరించారు. కార్యక్రమానికి ఎంపిక చేసుకున్న వేదిక సరిగా లేకపోవడం, మహేష్ బాబుకు సెక్యూరిటీ వంటి సమస్యల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నిర్వాహకులు మీడియాకు తెలిపారు.
#మీటూ: అర్జున్ వర్సెస్ శృతి, రెండుగా చీలిన ఇండస్ట్రీ, తల పట్టుకున్న సినీ పెద్దలు!
మహేష్ బాబు సొంతంగా
మరోవైపు సీనియర్ హీరో శ్రీకాంత్ మహేష్ ఈవెంట్ పై భిన్నంగా స్పందించినట్లు ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. ఈ ఈవెంట్ ని మహేష్ బాబే చారిటి నిర్వహించేందుకు నిధుల కోసం ప్లాన్ చేసుకున్నారని తెలిపాడు. మా అసోసియేషన్ కు ఈ ఈవెంట్ కు ఎలాంటి సంభందం లేదని శ్రీకాంత్ తెలిపాడు.
వేసవిలో మహర్షి
ఇదిలా
ఉండగా
మహేష్
బాబు
నటిస్తున్న
మహర్షి
చిత్రం
వచ్చే
ఏడాది
వేసవిలో
విడుదల
కానుంది.
ఈ
ఏడాది
వేసవిలో
మహేష్
భరత్
అనే
నేను
చిత్రంతో
అభిమానులని
అలరించిన
సంగతి
తెలిసిందే.
ప్రతిభ
గల
దర్శకుడు
వంశీ
పైడిపల్లి
మహర్షి
చిత్రాన్ని
తెరకెక్కిస్తున్నారు.
అందాల
తార
పూజా
హెగ్డే
ఈ
చిత్రంలో
హీరోయిన్.