Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
మహేష్ బాబు మైండ్ బ్లాక్.. 24 గంటల్లోనే ఆల్ టైమ్ రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు మండే సర్ప్రైజ్ అదిరింది. ఇకనుంచి సంక్రాంతి వరకు ప్రతీ సోమవారం సర్ప్రైజ్ చేస్తామని ప్రకటించిన 'సరిలేరు నీకెవ్వరు' యూనిట్.. మొదటి సోమవారమే మైండ్ బ్లాక్ చేసేసింది. చిత్రంలోని మొదటి పాట విడుదల చేసి మహేష్ అభిమాన వర్గాల్లో నూతనోత్సాహం నింపింది.
ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ చేసి కిక్ స్టార్ట్ ఇచ్చిన చిత్రయూనిట్.. మైండ్ బ్లాక్ పాటతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో జోష్ నింపింది. డిసెంబర్ 2వ తేదీ (సోమవారం) సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు విడుదలైన ఈ పాట మొదటి 24 గంటల్లోనే 9.2 మిలియన్ల వ్యూస్ రాబట్టి సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు యూనిట్ సభ్యులు.
ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ కూడా ఆసక్తికరంగానే ఉండటంతో సరిలేరు నీకెవ్వరు సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు జనం. దీంతో ఇకపై ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రతీ సోమవారం ప్రేక్షకలోకాన్ని మిస్మరైజ్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.
అనిల్ సుంకర, దిల్ రాజులతో పాటు మహేష్ బాబు సంయుక్తంగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీని నిర్మించడం విశేషం. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారీ అంచనాల నడుమ జనవరి 11వ తేదీన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విడుదల కానుంది.