twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కోసం మహేష్...ఫ్యాన్స్‌లో మార్పొస్తుందా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన 'జల్సా' చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు బాగా ప్లస్సయిందని చెప్పక తప్పదు.

    మహేష్ బాబు ఆ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉన్న స్నేహమే. త్రివిక్రమ్ వైపు నుంచి ఆలోచిస్తే....మహేష్ బాబు వాయిస్‌లో ఓ ప్రత్యేకత, ఆకర్షణ ఉండటంతో పాటు తనకు సెంటిమెంటుగా కలిసొస్తుందనే ఉద్దేశ్యంతో 'జల్సా' సమయంలో ఆ ప్రయోగంచేసాడు.

    'జల్సా'లో త్రివిక్రమ్ చేసిన ప్రమోగం సక్సెస్ కావడంతో.....అదే మ్యాజిక్‍‌ను మరోసారి రిపీట్ చేయాలని నిర్ణయించాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న తన తాజా సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రంలో మరోసారి మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చెప్పించారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

    ఒక స్టార్ హీరోతో మరో స్టార్ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పించడం సినిమాలకు ఎంత మేలు చేస్తాయనే విషయం పక్కన పెడితే......అభిమానుల్లో ఒక మంచి మార్పుకు దారి తీస్తుందని ఆశించొచ్చు. ఈ హీరోల మధ్య మంచి స్నేహ బంధం, సహకరించుకునే తత్వం ఉన్నా వీరి అభిమానుల విషయానికొస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మరి ఇకనైనా వారిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.

    English summary
    Mahesh Babu's voice over for Pawan Kalyan's upcoming film 'Attarintiki Daredi'. The film directed by Trivikram Srinivas. Samantha in female lead. As per trade reports, Atthariniki Daaredhi will release on Gandhi Jayanthi (Oct 2nd).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X