మహేష్ బాబు ఫ్యామిలీ గోవా టూర్.. (ఫోటోస్)
హైదరాబాద్: మహేష్ బాబు కొన్ని రోజులుగా 'బ్రహ్మోత్సవం' షూటింగులో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మహేష్ బాబు షూటింగ్ పార్ట్ పూర్తయినట్లు సమాచారం. ప్రతి సినిమా షూటింగ్ ముగియగానే మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెలుతుంటారు. ఎక్కువగా విదేశీ టూర్లకే మహేష్ బాబు ప్రాధాన్యత ఇస్తుంటారు.
అయితే ఈ సారి మాత్రం గోవాలో ప్లాన్ చేసారు. మండే ఎండల నుండి కాస్తంత సేద తీరడానికి ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లారు. గోవా ఫోటోలను నమ్రత తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, కాజల్, ప్రణీతలు కథానాయికలు. ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016న విడుదల చేయటానికి గతంలో తేదీని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏప్రియల్ 29 కి వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్ ఎగ్రిమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
స్లైడ్ షోలో గోవా ఫోటోస్...

గోవాలో మహేష్ బాబు ఫ్యామిలీ
మహేష్ బాబు భార్య పిల్లలతో కలిసి గోవాలో గడిపేందుకు వెళ్లారు.

నమ్రత
ఇందుకు సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.

గోవా హాట్
గోవా చాలా హాట్ హాట్ గా ఉందంటూ నమ్రత వెల్లడించారు.

సితార
గోవాకు విమానంలో వెలుతూ సితార....

సెల్ఫీ
హైదరాబాద్ లో విమానం ఎక్కిన వెంటనే నమ్రత ఇలా ఓ సెల్పీ పోస్టు చేసారు.

మహేష్ బాబు ఫ్యామిలీ గోవా టూర్.. (ఫోటోస్)
మహేష్ బాబు ఫ్యామిలీ గోవా టూర్.. (ఫోటోస్)


Click it and Unblock the Notifications











