Don't Miss!
- Automobiles MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- News ఏపీ ఫలితంపై సర్వేలు తేల్చిందేంటి - వారి మౌనం వెనుక..!!
- Sports శ్రేయస్ అయ్యర్కు బిగ్ షాక్.. భారీ జరిమానా
- Finance Patanjali Share: బాబా రామ్దేవ్ కంపెనీకి విదేశీ ఇన్వెస్టర్లు.. కోర్టు మెుట్టికాయల తర్వాత..
- Technology Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
- Lifestyle అందుకే కవలలు పుడతారు.. ఈ రహస్యం తెలియని వారు చాలా తక్కువ..
- Travel ఇండియాలోని సమ్మర్లో వెళ్లకూడని సందర్శనీయ ప్రదేశాలివే!
మహేష్ ముచ్చట్లకు విజయశాంతి ఆశ్చర్యం.. సూర్యుడివో చంద్రుడివో అంటూ హల్చల్
భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సూపర్ స్టార్.. మరో సారి బాక్సాఫీస్ను షేక్ చేసి తనకు నిజంగానే ఎవరూ సరిలేరని నిరూపించేందుకు టైమ్ ఫిక్స్ చేసుకున్నాడు. అనిల్ రావిపూడితో చేస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి ప్రతీ సోమవారం ఓ పాటను రిలీజ్ చేస్తామని ప్రకటించిన యూనిట్ చెప్పినట్టుగానే.. గతవారం ఓ పాటను విడుదల చేయగా మరో పాటను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది.
విమర్శల పాలైన మొదటి పాట..
మైండ్ బ్లాక్.. నిజంగానే మైండ్ బ్లాక్ అయిపోద్ది.. మాస్ బీట్ అంటూ ఎంతో హల్ చల్ చేసిన చిత్రయూనిట్కు నిరాశే మిగిలింది. ఈ మధ్య కాలంలో ఈ పాటపై వచ్చినన్నీ ట్రోలింగ్స్ మరే సాంగ్పై రాలేదు. అన్ని పాటలను కలిపి కొట్టాడని దేవీ శ్రీ ప్రసాద్నే ఏకిపారేశారు.
రెండో పాటను సిద్దం చేసిన యూనిట్..
మొదటి పాట అందర్నీ మెప్పించకపోయినా.. కనీసం రెండో పాటతోనైనా సంతృప్తి చెందేలా ఉండాలని కూల్ సాంగ్ను రిలీజ్ చేయనున్నారు. ఫ్యామిలీ సాంగ్ను రిలీజ్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు.రేపు సాయంత్రం 5.04గంటలకు సూర్యుడివో చంద్రుడివో అనే పాటను రిలీజ్ చేయనున్నారు.
|
పోస్టర్లతో హంగామా..
ఈ పాటకు సంబంధించిన విజువల్స్ అదిరిపోయేలా ఉన్నట్లు తెలుస్తోంది. కేరళ అందాలే ప్రధాన ఆకర్షణగా సాగేట్టు కనిపిస్తోంది. పచ్చని పంట పొలాలు, కుటుంబ సభ్యలు, ఇలా పల్లె వాతావరణాన్ని చూపించబోతోన్నట్లు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లతో అర్థమవుతోంది.
Recommended Video
విజయశాంతితో ఏదో చెబుతున్న మహేష్..
ఈ పాటపై హైప్ క్రియేట్ చేసే నేపథ్యంలో తాజాగామరో పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్లో మహేష్ ఏదో చెబుతున్నట్లు.. విజయశాంతి ఎంతో శ్రద్దగా వింటూ ఆశ్చర్యపోతోన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ పాటైనా మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చల్లారుస్తుందో లేదో చూడాలి. ఇది కూడా బెడిసికొడితే దేవీ పరిస్థితి ఇక కష్టమే. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు థియేటర్లలోకి వచ్చేందుకు ఫిక్స్ అయింది. రష్మిక మందాన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి రత్నవేలు కెమెరామెన్గా పని చేస్తున్నారు.