ఫీలైన మహిళలు, సారీ చెప్పిన మహేష్ బాబు
హైదరాబాద్ : మహేష్ బాబు సినిమాలోని ఓ సీన్ మహిళలను కించపరిచే విధంగా ఉందని...దుమూరం చెలరేగిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న '1-నేనొక్కడినే' చిత్రంలో ఈ సీన్ ఉంది. ఇటీవల విడుదలైన పోస్టర్లలో మహేష్ బాబు సముద్రం ఒడ్డున నడుస్తుంటే, ఆయన కాళ్ల వెనక హీరోయిన్ కుక్కలా పాకడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు.
సినిమా హీరోయిన్ సమంత, శేఖర్ కమ్ముల, సిద్ధార్థ తదితరులు సైతం ఈ పోస్టర్ పై విమర్శలు చేసారు. సెలబ్రిటీలు సైతం ఈ పోస్టర్ పై విమర్శలు చేయడంతో మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది. అయితే ఈ వివాదం మరింత పెద్దది కాకముందే దీనికి తెర దించారు మహేష్ బాబు.
ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.....'ఆ పోస్టర్ వల్ల ఎవరి మనో భావాలైనా దెబ్బతింటే సారీ చెబుతున్నాను. వాస్తవానికి అందులో తప్పేమీ లేదు. సినిమాలో సాంగు పూర్తిగా చూస్తే ఆ సీన్లో తప్పులేదని అందరికీ అర్థమవుతుంది' అని మహేష్ బాబు వ్యాఖ్యానించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. '1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications












