Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
పేజ్-3 పార్టీలపై మహేష్ బాబు స్పందన ఇలా...!
హైదరాబాద్: ఈ మధ్య నగరాల్లో పేజ్ -3 కల్చర్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు పేజ్-3 పార్టీల్లో ఎక్కవగా దర్శనం ఇస్తుండటంతో యువత కూడా ఇటు వైపు ఆకర్షితులు అవుతున్నారు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం.
ఉంటే షూటింగులో, లేకుంటే ఇంట్లో....తప్ప మహేష్ బాబు బయట కనిపించే సందర్భాలు చాలా తక్కువ. ఇక పేజ్-3 పార్టీలకు, అలాంటి తరహా కార్యక్రమాలకు మహేష్ బాబు వీలైనంత దూరంగా ఉండటమే ఆయనకు అలవాటు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఇలాంటి విషయాలపై స్పందించారు.
'చిన్నతనం నుండే నాకు పార్టీలకు వెళ్లే అలవాటు లేదు. పెళ్లి తర్వాత ఫ్యామిలీకి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పేజ్-3 పార్టీలను నేను అస్సలు ఖాతారు చేయను. సినిమా రంగానికి, ఇతర రంగాలకు చెందిన పేజ్-3 కార్యక్రమాలకు తప్పకుండా హాజరు కావాలనే ఆసక్తి కూడా ఉండదు. ఇల్లు, పిల్లలకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను' అని మహేష్ బాబు వెల్లడించారు.
ప్రస్తుతం మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా మహేష్ తనయుడు గౌతం కృష్ణ బాలనటుడిగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం చేస్తున్నాడు.