Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
మరోసారి తమిళ్ వైపు మహేష్ ఫోకస్.. అప్పుడే భారీ బిజినెస్ డీల్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే సౌత్ అగ్ర హీరోల్లో ఒకరిగా క్రేజ్ అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ప్రిన్స్ స్థాయి చాలానే పెరిగింది. ఒక సినిమాను సెట్స్ పైకి తెస్తే రిలీజ్ అయ్యాక దాదాపు 150కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి. ఇక బోనస్ గా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మహేష్ సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు.
అయితే తమిళ్ హీరోలు తెలుగులో సక్సెస్ అవుతుంటే.. తెలుగు హీరోలు మాత్రం కోలీవుడ్ లో సక్సెస్ కావడం లేదు. స్పైడర్ సినిమాతో ఒకసారి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకున్న మహేష్ కొంత ఉహీంచని విదంగా డిజాస్టర్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు సర్కారు వారి పాటతో ఎలాగైనా కోలీవుడ్ లో హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడు. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలవ్వకముందే కోలీవుడ్ ప్రముఖ ఛానల్ విజయ్ టీవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకుందట.
మహేష్ బాబుకు తమిళ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఒక్క హిట్టు పడితే ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే సర్కారు వారి పాటను కోలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సీనియర్ హీరో ఒకరు విలన్ పాత్రలో నటించనున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆ రూమర్స్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది.