Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబు, చిరంజీవి మంతనాలు.. సూపర్ స్టార్ ఏమన్నాడంటే! నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ 25వ వార్షికోత్సవం సందర్బంగా 'సినీ మహోత్సవం' పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. చిరంజీవి సహా అలనాటి మేటి తారలతో కళకళలాడింది సినీ మహోత్సవ వేదిక.
సీనియర్ తారలు.. సందడి వాతావరణం
ఈ వేడుక కృష్ణ, కృష్ణంరాజు, తలసాని శ్రీనివాసయాదవ్, టి.సుబ్బరామిరెడ్డి, మురళీమోహన్, జయప్రద, జయసుధ, సుమలత, రాజేందప్రసాద్, నరేశ్, కోటశ్రీనివాసరావు సహా పలువురు సినీ పెద్దలు హాజరయ్యారు. దీంతో సభా ప్రాంగణమంతా సందడి సందడిగా కనిపించింది.
మహేష్ బాబు, చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్
అయితే ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సాధారణంగా చిరంజీవి, మహేశ్ ఇద్దరూ కలిసి ఒకే వేడుకలో కనపడటం చాలా చాలా అరుదుగా చూశాం. అలాంటి అరుదైన సందర్భం ఈ వేడుకలో కనిపించడంతో కెమెరా కళ్లన్నీ ఆ ఇద్దరిపైనే పడ్డాయి.
అభిమానుల్లో జోష్ నింపేలా మహేష్ స్పీచ్
చిరంజీవి, మహేశ్లు కలిసి కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ అరుదైన కలయిక చుసిన ఇరువురి అభిమానులు ఖుషీ అవుతూ అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా వేదికపై మహేష్ మాట్లాడిన మాటలు ఇరువురు అభిమానుల్లో జోష్ నింపాయి.
చిరంజీవితో మాట్లాడుతుంటే..
చిరంజీవిగారితో మాట్లాడుతుంటే ఓ ఎనర్జీ వస్తుంది. ఆయన మరికొద్ది రోజుల్లో `సైరా నరసింహారెడ్డి` సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. నేను కూడా సైరా కోసం ఎదురుచూస్తున్నాను. సైరా యూనిట్కు ఆల్ ది బెస్ట్`` అన్నారు. అలాగే ఈ వేడుకను నిర్వహిస్తున్న ప్రొడక్షన్ యూనియన్కు మహేశ్ అభినందనలు తెలిపారు.
సరిలేరు నీకెవ్వరు.. సైరా నరసింహా రెడ్డి
ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే చిరంజీవి ఇప్పటికే 'సైరా నరసింహా రెడ్డి' సినిమా షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 2వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది.