twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు, చిరంజీవి మంతనాలు.. సూపర్ స్టార్ ఏమన్నాడంటే! నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్

    |

    తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ 25వ వార్షికోత్సవం సందర్బంగా 'సినీ మహోత్సవం' పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. చిరంజీవి సహా అలనాటి మేటి తారలతో కళకళలాడింది సినీ మహోత్సవ వేదిక.

    సీనియర్ తారలు.. సందడి వాతావరణం

    సీనియర్ తారలు.. సందడి వాతావరణం

    ఈ వేడుక కృష్ణ‌, కృష్ణంరాజు, త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌, టి.సుబ్బ‌రామిరెడ్డి, ముర‌ళీమోహ‌న్‌, జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌, సుమల‌త‌, రాజేంద‌ప్ర‌సాద్‌, న‌రేశ్‌, కోట‌శ్రీనివాస‌రావు స‌హా ప‌లువురు సినీ పెద్ద‌లు హాజ‌ర‌య్యారు. దీంతో సభా ప్రాంగణమంతా సందడి సందడిగా కనిపించింది.

     మహేష్ బాబు, చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్

    మహేష్ బాబు, చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్

    అయితే ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సాధారణంగా చిరంజీవి, మ‌హేశ్‌ ఇద్దరూ కలిసి ఒకే వేడుక‌లో క‌న‌ప‌డ‌టం చాలా చాలా అరుదుగా చూశాం. అలాంటి అరుదైన సందర్భం ఈ వేడుకలో కనిపించడంతో కెమెరా కళ్లన్నీ ఆ ఇద్దరిపైనే పడ్డాయి.

    అభిమానుల్లో జోష్ నింపేలా మహేష్ స్పీచ్

    అభిమానుల్లో జోష్ నింపేలా మహేష్ స్పీచ్

    చిరంజీవి, మ‌హేశ్‌లు క‌లిసి కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ అరుదైన కలయిక చుసిన ఇరువురి అభిమానులు ఖుషీ అవుతూ అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా వేదికపై మహేష్ మాట్లాడిన మాటలు ఇరువురు అభిమానుల్లో జోష్ నింపాయి.

    చిరంజీవితో మాట్లాడుతుంటే..

    చిరంజీవితో మాట్లాడుతుంటే..

    చిరంజీవిగారితో మాట్లాడుతుంటే ఓ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఆయ‌న మరికొద్ది రోజుల్లో `సైరా న‌ర‌సింహారెడ్డి` సినిమాతో మ‌న ముందుకు రాబోతున్నారు. నేను కూడా సైరా కోసం ఎదురుచూస్తున్నాను. సైరా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. అలాగే ఈ వేడుకను నిర్వహిస్తున్న ప్రొడ‌క్ష‌న్ యూనియ‌న్‌కు మ‌హేశ్‌ అభినంద‌నలు తెలిపారు.

    సరిలేరు నీకెవ్వరు.. సైరా నరసింహా రెడ్డి

    సరిలేరు నీకెవ్వరు.. సైరా నరసింహా రెడ్డి

    ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే చిరంజీవి ఇప్పటికే 'సైరా నరసింహా రెడ్డి' సినిమా షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 2వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    The Silver Jubilee function was held on the occasion of 25 years of the Telugu Cinema Industry Production Managers Union. Chiranjeevi, Mahesh Babu and Union Minister Kishan Reddy attended the ceremony in Hyderabad on Sunday night.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X