Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్-శ్రీనువైట్ల కాంబినేషన్లో మరో ప్రాజెక్టు!
చాలా కాలం తర్వాత మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్టు హిట్టు తెచ్చి పెట్టాడు దర్శకుడు శ్రీను వైట్ల. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా విడుదలైన దూకుడు సినిమా బంపర్ కలెక్షన్ లతో దూసుకెలుతూ, బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉండటంతో అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. అతిథి, ఖలేజా లాంటి వరుస ప్లాపులతో చతికల బడ్డ మహేష్ బాబుకు ఈ విజయం నూతనోత్తేజాన్ని తెచ్చిపెట్టింది.
కాగా...తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. లేటెస్టుగా అందిన సమాచారం ప్రకారం మహేష్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో అతి త్వరలోనే మరో సినిమా రాబోతోందని అంటున్నారు. శ్రీను వైట్ల వర్కింగ్ స్టయిల్ మహేష్ బాబుకు బాగా నచ్చింది. దీనికి తోడు విరిద్దరి కాంబినేషన్ పై హట్ చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వేడి ఉన్నప్పుడే వాడుకోవాలనే చందంగా....ఇప్పడే మరో సినిమా కమిట్ అయితే మంచి రిజల్టు ఉంటుదని వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2012 సంవత్సరాంతంలో లేదా 2013లో ఈ సినిమా సెట్స్ మీదనకు రానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పూరి దర్శకత్వంలో 'బిజినెస్ మ్యాన్" షూటింగ్ లో బిజీగా ఉన్నమహేష్ బాబు, ఈ సినిమా పూర్తయిన వెంటనే, విక్టరీ వెంకటేష్ తో మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. మరో వైపు శ్రీను వైట్ల తన తర్వాతి ప్రాజెక్టును జూ.ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్నారు. సో...ఇవి పూర్తయితే గానీ మళ్లీ మహేష్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో మరో సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.