Don't Miss!
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ బాబు, శ్రీను వైట్ల చిత్రం ప్రారంభం ఎక్కడ...ఎప్పుడు
మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం సెప్టెంబర్ 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహేష్, సమంతల మీద ఓ పాటని చిత్రీకరించటంతో సినిమా ప్రారంభమవుతుంది. ఇక ఈ పాటకి లొకేషన్ గా గుజరాత్, అలాంగ్ లోని ఎంపిక చేసారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. శ్రీను వైట్ల తన పొటిన్షియల్ మొత్తం వినియోగించి మంచి చిత్రాన్ని రూపొందిస్తానని చెప్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల తన కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తున్నాడు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ప్రస్తుతం దూకుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే ఈ చిత్రంలో మహేష్..పోలీస్ ఆఫీసరు పాత్ర చేస్తున్నారన తెలిసింది. ధామస్.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.