Don't Miss!
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబు, శ్రీను వైట్ల చిత్రం ప్రారంభం ఎక్కడ...ఎప్పుడు
మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం సెప్టెంబర్ 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహేష్, సమంతల మీద ఓ పాటని చిత్రీకరించటంతో సినిమా ప్రారంభమవుతుంది. ఇక ఈ పాటకి లొకేషన్ గా గుజరాత్, అలాంగ్ లోని ఎంపిక చేసారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. శ్రీను వైట్ల తన పొటిన్షియల్ మొత్తం వినియోగించి మంచి చిత్రాన్ని రూపొందిస్తానని చెప్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల తన కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తున్నాడు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ప్రస్తుతం దూకుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే ఈ చిత్రంలో మహేష్..పోలీస్ ఆఫీసరు పాత్ర చేస్తున్నారన తెలిసింది. ధామస్.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.