Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబు ది బిజినెస్ మేన్ ‘గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్స్’ ..
'ఎవడు కొడితే దిమ్మ తిరగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..! 'పోకిరి"చిత్రంలోని ఈ పవర్ ఫుల్ డైలాగ్ ని ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేరు. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సాధించిన సంచలన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయం సాధించిన ఈ కాంబినేషన్ లో మరో చిత్రం రానుంది. 'ది బిజినెస్ మాన్" పేరుతో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా విశేషాలను నిర్మాత వెంకట్ తెలియజేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకు ముందు పోషించనటువంటి పవర్ పుల్ పాత్రను ఈ చిత్రంలో చేస్తారు. పూరి చెప్పిన లైన్ కు మహేష్ బాగా ఇంప్రెస్ అయ్యారు. 'గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్స్" అనేది ఈ చిత్రం ఉపశీర్షికతో దీనిని బట్టి ఇది ఎంతటి సంచలనాత్మకంగా వుంటుందో ఊహించుకోవచ్చు. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన పోకిరిని మించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. సెన్సేషన్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రం తప్పకుండా తెలుగు సృష్టిస్తుందనే నమ్మకం వుంది" అని తెలిపారు.