Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్తో ముగ్గురు హీరోయిన్లు, సమంతపై ఫ్యాన్స్ చిరాకు!
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ఒకే సినిమాలో ముగ్గు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోయే ఈ సినిమాను ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. పివిపి సినిమా బేనర్లో ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్నినిర్మించబోతున్నారు.
సినిమాకు మరింత మసాలా అద్దడంలో భాగంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. లీడ్ హీరోయిన్ గా సమంత నటించనుందని అంటున్నారు. మిగతా ఇద్దరు ఎవరు అనేది ఇంకా ఖరారుకాలేదు. అయితే సమంతను ఎంపిక చేయడంపై ఆయన అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సమంత, మహేష్ బాబు మధ్య చిన్న పాటి మాటల యుద్ధం జరిగింది. అందుకే సమంత అంటే మహేష్ బాబు అభిమానులకు చిరాకు. 1-నేనొక్కడినే సమయంలో సమంత తన ట్విట్టర్ ద్వారా వివాదాస్సద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మహేష్ బాబు అభిమానులంతా సమంతపై ఇంటర్నెట్ ద్వారా దండెత్తారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు' సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఇందులో మహేష్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.