Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
మహేష్ సెంటిమెంట్ ని నమ్మి...మిగతా హీరోలు కూడా..
హైదరాబాద్ : ఫామ్ లో ఉన్న హీరో ఏం చేస్తే మిగతా ప్రపచం దాన్ని అనుకరించటానికి,అనుసరించటానికి ప్రయత్నించటం సహజం. ప్రస్తుతం తెలుగులో తిరుగులేని చక్రవర్తిగా..సూపర్ స్టార్ గా వెలుగుతున్న హీరో మహేష్ బాబు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న మహేష్ పైనే, ఆయన విజయాల వెనక ఉన్న సెంటిమెంట్స్ పైనే మిగతా సిని హీరోల దృష్టి. తాజాగా ఆయన అజ్మీర్ దర్గాకి వెళ్లి వచ్చారు. ఆయన రెగ్యులర్ గా ఆ దర్గాకి వెళ్లివస్తారని ప్రముఖంగా మీడియాలో వచ్చింది. దాంతో తెలుగులో కొందరు హీరోలు కూడా ఇదే విషయమై ఫాలో అయితే ఎలా ఉంటుందనే చర్చలలో ఉన్నట్లు సమాచారం. తాము ఆ దర్గాకు వెళ్లి ప్రార్ధనలు చేసి, విజయాన్ని సాధించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
దూకుడు విజయవంతం అయిన తర్వాత రెగ్యులర్ గా మహేష్ ..ఆ దర్గాని సందర్శిస్తున్నారు. బిజినెస్ మ్యాన్ రిలీజ్ కు ముందు కూడా ఆయన అక్కడకి వెళ్ళి ప్రార్దనలు చేసారు. ఈ సంవత్సరంలో ఈ దర్గాకు వెళ్లటం రెండో సారి. పిబ్రవరిలో మహేష్ ఓ సారి ఈ దర్గాకు వెళ్లి ప్రార్దనలు చేసి వచ్చారు. సంక్రాంతి కి విడుదల అవుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం విజవంతం కావాలని ఈ సారి దర్గాని దర్శించినట్లు చెప్తున్నారు. మహేష్ కు ఓసారి నమ్మకం ఏర్పడితే దాన్ని పూర్తిగా ఫాలో చేస్తారని ఆయన సన్నిహితులు చెప్తారు.
ఇక వెంకటేష్, మహేష్బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మహేష్ సరసన సమంత,వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు. వెంకటేష్,మహేష్ బాబు అన్నదమ్ములుగా ఈ చిత్రంలో కనపించనున్నారు. అంజలి..మహేష్ కు వదినగా చేస్తోంది.
ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు.