GunturKaraam: మహేష్ బాబు ఫ్యాన్స్కు షాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణం ఏమిటంటే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు వెరీ బ్యాడ్ న్యూస్. మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును జనవరి 6న జరుపనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు యూఎస్ఏ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నట్లు కూడా వెల్లడించారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు రద్దు అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'గుంటూరు కారం'. ఇక ఈ సినిమా మరో కొన్ని రోజుల్లో ఆడియన్స్ ముందుకు వచ్చేయబోతుంది. మూవీ టీం ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకుంటూనే... మరోపక్క ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే మూవీ నుంచి సాంగ్స్ వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. జనవరి 6 శనివారం నాడు ఈ ఈవెంట్ జరగబోతుందని ప్రకటించారు. ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారని అంతా అనుకున్నారు. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుతో మహేశ్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ ఈవెంటును అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
ఇదంతా బాగానే ఉన్నా... ఇప్పుడు మహేశ్ బాబు అభిమానులకు చిత్ర బృందం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును రద్దు చేసినట్లు సోషల్ మీడియావేదికగా ప్రకటించింది. గుంటూరు కారం చిత్ర బృందం ఓ నోట్ షేర్ చేసింది. అందులో.. మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, ఊహించని పరిస్థితులు మరియు భద్రతా అనుమతుల సమస్యల కారణంగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంటును రద్దు చేస్తున్నాం. 6 జనవరి 2024న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుంటూరుకారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ని నిర్వహించడం లేదు. ఈ ప్రకటనకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము అంటూ రాసుకువచ్చారు.

ఈ ప్రత్యేక నోట్ కు హార్ట్ సింబర్ బ్రేక్ అయింది జోడించారు. ఇక దీనితో పాటు.. గుంటూరు కారం ఈవెంట్ కోసం కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని తెలిపారు. ఇక ఈ న్యూస్ విన్న మహేశ్ ఫ్యాన్స్ నిరాశకు గురువుతున్నారు. ట్రైలర్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న వారికి వాళ్ల ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. త్వరగా ఈవెంట్ అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఇక ఈ సినిమాలో మహేశ్ కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించగా.. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











