మహేష్ బాబు పాట పాడబోతున్నాడోచ్!
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు చిత్రంలో నటిస్తున్నసంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ పాట పాడబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు.

ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని రంగంలోకి దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం.
ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. ఇందులో మహేష్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్ కి తండ్రిగా రాజేంద్రప్రసాద్ చేస్తున్నారని సమాచారం. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర.


Click it and Unblock the Notifications











