Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆల్ట్రా మోడ్రన్ లుక్ తో మహేష్ బాబు
హైదరాబాద్: మొదటినుంచీ మహేష్ బాబు తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి , బాడీ లాంగ్వేజ్ దాకా ప్రతీ చిత్రంలోనూ ఢిఫెరెంట్ గా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పోకిరి నుంచి ఆయన పూర్తిగా ఢిఫెరెంట్ లుక్ తో కనిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలోనూ ఆయన మొత్తం ఓవరాల్ గా కొత్తదనాన్ని ప్రెజెంట్ చేయటానికి, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇప్పటివరకూ కనిపించని ఆల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించనున్నారు. ఆ లుక్ ఫ్యాన్స్ ని పూర్తిగా అలరిస్తుందని భావిస్తున్నారు.
దర్శకుడు సుకుమార్ తన హీరోలను విభిన్నంగా చూపుతూ వస్తున్నారు. ఆర్య, ఆర్య 2లలో అల్లు అర్జున్ ని స్టైలిష్ గా చూపారు. అలాగే నాగచైతన్య ను ఇంతకు ముందు ఎవరూ చూపని విధంగా 100% లవ్ లో ప్రెజెంట్ చేసారు. ఇప్పుడు ఆయన మహేష్ ని కొత్త అవతారంలో మరింత అందంగా చూపటానికి, తన రెగ్యులర్ కెమారామెన్ రత్నవేలుతో కలిసి ప్రతీ ఫ్రేమ్ అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. మహేష్పై ఇటీవలే ఓ పాటను తెరకెక్కించారు. ఈ నెలాఖరు వరకూ అక్కడే కీలకమైన సన్నివేశాల్ని కూడా తెరకెక్కిస్తారు.
మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కృతి సనన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టడం ఇదే తొలిసారి. 'ఆచార్య' అనే పేరును పరిశీలిస్తున్నారు. ''వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. మహేష్ పాత్ర విభిన్నంగా సాగుతుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
'రెబల్' చిత్రంలో గ్యాంగ్ స్టర్ బ్రదర్గా విలన్ పాత్ర పోషించిన విక్రమ్ సింగ్...మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో కూడా బ్యాడ్ బాయ్ పాత్రలో మహేష్ బాబుతో ఫైట్ చేస్తున్నాడు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈచిత్రం షూటింగులో మహేష్, విక్రమ్ సింగ్ మధ్య ఫైట్ సీన్లు చిత్రీకరించారు. ఈ విషయం గురించి విక్రమ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొంటూ.... 'రెబల్ చిత్రం తర్వాత మహేష్ బాబు, సుకుమార్ చిత్రంలో అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. రామ్ లక్షణ్ స్టంట్స్ చాలా బాగా కంపోజ్ చేసారు. నా పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను' అంటూ పేర్కొన్నాడు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి గోపి.