Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబు బంధువు, పద్మాలయ రాంబాబు అకాల మరణం
మహేష్ బాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మహేష్ బాబుకు మామయ్య వరుస అయ్యే శాఖమూరి రాంబాబు అలియాస్ పద్మాలయ రాంబాబు అకాల మరణం చెందారు. మహేష్ ఫ్యామిలీకి చెందిన పద్మాలయ స్టూడియోకు సంబంధించిన వ్యవహారాలు కొన్నేళ్లుగా ఆయనే చూసుకుంటున్నారు.
పద్మాలయ రాంబాబుగా...
కొన్నేళ్లుగా పద్మాలయ స్టూడియోస్ వ్యవహారాలు రాంబాబు చూసుకుంటున్నారు. స్టూడియో అభ్యున్నతికి ఆయన ఎంతగానో తోడ్పడ్డారని చెబుతుంటారు. ఆయన పేరు శాఖమూరి రాంబాబు అయినప్పటికీ ఇండస్ట్రీలో అందరూ ఆయన్ను పద్మాలయ రాంబాబు అని పిలుస్తుంటారు.
నిర్మాతగా రమేష్ బాబుతో మూవీ
ఒకప్పుడు మహేష్ బాబుకు ఆయన పర్సనల్ మేనేజర్గా కూడా రాంబాబు వ్యవహరించారు. మహేష్ సోదరుడు రమేష్ బాబుతో గతంలో ఓ చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు.
ఘట్టమనేని కుటుంబంలో విషాదం
రాంబాబు మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. ఘట్టమనేని అభిమానులు ఆయన మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
సినీ పరిశ్రమ సంతాపం
పద్మాలయ రాంబాబు మరణంపై పలువురు సినీ ప్రముకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.