Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ బాబు...పాతికేళ్ల లుక్ కోసం రూ.కోటి ఖర్చు?
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ఈ నెల 20న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మహేష్ బాబు మరింత యంగ్ లుక్ తో కనిపించబోతున్నారు.
40 ఏళ్ల వయసున్న ఆయన పాతికేళ్లలోపు ఉన్న కుర్రాడిలా కనిపించబోతున్నారు. ఇందుకోసం చాలా ఖర్చు పెట్టారు. ఆయన కాస్ట్యూమ్స్ విషయంలో, మేకప్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరోకు 30 నుండి 40 కాస్టూమ్స్ వాడతారు. అయితే ఇందులో మాత్రం మహేష్ బాబు కోసం దాదాపు 100 కాస్టూమ్స్ వాడారట. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైన్ అక్షయ్ త్యాగి మహేష్ బాబు కాస్టూమ్స్ డిజైన్ చేారు.
మహేష్ బాబుకు ఎలాంటి డ్రెస్సు వేస్తే ఆయన మరింత యంగ్ లుక్ తో కనిపిస్తారో....అక్షయ్ త్యాగి లాంటి నిపుణులతో కాస్టూమ్స్ డిజైన్ చేయించారు. మేకప్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. ఇందుకోసం రూ. కోటి ఖర్చు పెట్టారని టాక్.
పివిపి సంస్థ ఈ చిత్రాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో మహేష్ బాబు సినిమాలకు ఉన్న డిమాండుకు తగిన విధంగా అత్యధిక స్క్రీన్లు కేటాయించారు.
నైజాం ఏరియాలో 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ అన్ని థియేటర్ల ఉదయం 8.10కు అభిమానుల కోసం స్పెషల్ షో వేయాలని నిర్ణయించింది. తొలి రోజు(మే 20)న మాత్రమే ఈ స్పెషల్ షో వేస్తున్నారు.
ప్రస్తుతం మూవీ టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మే 20 'బ్రహ్మోత్సవం' చిత్రం విడుదలవుతోంది. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సంబంధించిన 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.