మహేష్ బాబు - వంశీ పైడిపల్లి చిత్రం డీటేల్స్
ప్రస్తుతం రామ్ చరణ్తో 'ఎవడు' చిత్రం తెరకెక్కిస్తున్న వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...'ఎవడు చిత్రాన్ని జులై నెలలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. 2014 జనవరి నెలలో మహేష్ బాబుతో నా తర్వాతి సినిమా ప్రారంభం అవుతుంది' అని వెల్లడించారు.
మహేష్ బాబు కోసం ఇప్పటికే స్టోరీ రెడీ చేసుకున్న వంశీ పైడిపల్లి, స్క్రిప్టు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టబోతున్నారు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్గా వైవిద్యమైన కథ, స్ర్కిప్టుతో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తాడని తెలుస్తోంది. అదే విధంగా మహేష్ బాబు లుక్ కూడా గత సినిమాలకు భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో దూసుకెలుతున్న మహేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నాడు. '1' సినిమాతో మహేష్ తిరుగులేని హీరోగా మారతాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications












