Don't Miss!
- News ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ సతీమణి నమ్రత వైరల్ పోస్ట్.. ఆ తోటలో అంటూ అంతా చెప్పేసింది
సోషల్ మీడియాను ఒక్కొక్కరూ ఒక్కోలా వాడుకుంటున్నారు. కమ్యూనికేషన్ పెరగడమేగాక, వ్యాపార వర్గాలకు ప్రకటనల పరంగా కూడా ఉపయోగం కలుగుతోంది. మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తాజాగా ఓ పోస్ట్ పెట్టడం, అది వైరల్ కావడం జరిగాయి. వివరాల్లోకి పోతే..
రాజు గారి తోటలో మహేష్ సతీమణి
మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఓ రెస్టారెంట్లో లంచ్ చేసి ఇందుకు సంబంధించిన ఫోటోను ఇన్స్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ రెస్టారెంట్ పేరు 'రాజు గారి తోట' అని తెలిపింది. ఇది హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పైన ఉంటుంది. ఈ రోడ్డులో ప్రయాణించే వారికి ఇది సుపరిచితం. ఎంతోమంది అక్కడ భోజనం చేస్తుంటారు. మంచి వాతావరణంలో నిర్మించిన ఈ రెస్టారెంట్ రుచికరమైన భోజనాన్ని అందిస్తోంది.
జగన్ సతీమణిని కలిసేందుకు వెళ్తూ వెళ్తూ
మహేష్ బాబు దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన వివరాలు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి తెలియజేసేందుకు గాను నమ్రతా విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ - విజయవాడ హైవే ప్రయాణంలో నమ్రతా రాజుగారితోట రెస్టారెంటులో భోజనం చేసింది. ఈ భోజనాన్ని మెచ్చుకుంటూ 'సూపర్' అని మెసేజ్ పెట్టింది నమ్రత.
భోజనం తిని మీనాక్షి పాన్
రెండు రోజుల క్రితం నేను విజయవాడకు వెళ్లిన సమయంలో 'రాజు గారి తోట' రెస్టారెంటుకు వెళ్లానని, ఇక్కడ మంచి ఆంధ్రా భోజనం తిన్నానని, ఘుమఘుమలాడే తందూరీ చాయ్ తాగానని, చివరగా మీనాక్షి పాన్ తీసుకున్నానని నమ్రతా ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో నేను చేసిన అద్భుతమైన భోజనం ఇది అన్నారు. మీరు కూడా ఇక్కడ రుచి చూడండని, నాకు చాలా నచ్చింది అని చెప్పారు.
|
ఈ రెస్టారెంట్ ఆ నిర్మాతదే! ఆ వ్యాపారానికి..
ఈ రాజు గారి తోట రెస్టారెంట్ ఓనర్ అనిల్ సుంకర అని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అయితే మొత్తానికి నమ్రత పెట్టిన పోస్ట్ బిజినెస్ పెరగడానికి కూడా దోహదపడవచ్చు. ఆమె పోస్టుకు చాలామంది అభిమానులు స్పందిస్తూ.. తప్పకుండా ఈసారి అక్కడ టేస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ రకంగా నమ్రత పోస్ట్ అనిల్ వ్యాపారానికి హెల్ప్ అయిందన్నమాట.
మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు
అనిల్ రావిపూడి రూపొందిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో మరోసారి మహేష్ బాబు కామెడీ ఎపిసోడ్ చూడాలని ఆతృతగా ఉంది ప్రేక్షకలోకం. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.