Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డిప్రెషన్ లో ఉన్నమహేష్ కి త్రీ ఇడియట్స్ అమృతాంజన్..
మహేష్ బాబు ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దాని డైరక్టర్ కూడా.. అలాంటి ఇలాంటి వాడు.. కాదు..రోబో తో బాలీవుడ్ ను సైతం షేక్ చేసిన శంకర్.. త్రీ ఇడియట్స్ రీమేక్ లో మహేష్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే..అయితే అక్కడ కరీనా వేసిన పాత్రను.. ఇక్కడ ఇలియానా చేయబోతుంది. కాగా తమిళ వెర్షెన్ లో విజయ్ నటించనున్నాడు. ఈ రెండు వెర్షన్ లో ఇలియానా యే కథానాయిక గా ఎంపికవ్వడం విశేషం. మిగిలిన రెండు పాత్రలకు గాను జీవా, మరియు సిద్దార్థ పేర్లు వినవస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు సరైన హిట్ లేని మహేష్ బాబుకు ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వనుంది..అయితే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది..అతి త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి..వచ్చే వేసవిలో రీలీజ్ చేయాలని భావిస్తున్నారు.. ఖలేజా డివైడ్ టాక్ తో కాస్త డిప్రెషన్ లో ఉన్న మహేష్..త్రీ ఇడియట్స్ తో పోకిరి రీపీట్ అవుతుందని భావిస్తున్నారు.