Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్, అల్లు అర్జున్ మధ్య రాజీ.. పరిష్కారం దిశగా వివాదం!
Recommended Video
బాలీవుడ్లో సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా విడుదలవుతుంటాయి. తెలుగులో చాలా అరుదుగా ఈ పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి, దసరా, దీపావళి పండుగ సందర్భంలో తప్పితే పెద్దగా సినిమాల మధ్య పోటీ ఉండదు. ఇలాంటి ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా ప్రిన్స్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్దా నువ్వా నేనా అంటూ కొట్టుకొనే పరిస్థితి ఎదురైంది. అయితే ఆ వివాదాన్ని తగ్గుముఖం పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
స్టార్ హీరోల రిలీజ్ గందరగోళం
ప్రస్తుతం దర్శకుడు వక్కంత వంశీ రూపొందించే ‘నా పేరు సూర్య' చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు. వేసవి సెలవులను టార్గెట్ చేసుకొని ఏప్రిల్ 27న విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రిన్స్ మహేష్బాబు నటించే ‘భరత్ అనే నేను' చిత్రాన్ని కూడా ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో గందరగోళం ఏర్పడింది.
నిర్మాతలుపై బన్ని వాసు ఫైర్
మహేష్, అల్లు అర్జున్ చిత్రాల వివాదాస్పద రిలీజ్ నేపథ్యంలో అప్పట్లో బన్నీ వాసు కొంచెం ఘాటుగానే స్పందించారు. మేము ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. అయితే మమ్మల్ని సంప్రదించకుండా, మాతో ఓ మాట కూడా అనుకుండా అదే డేట్కు వాళ్ల సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించేయడం సబబు కాదు అని వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.
హీరోల మధ్య రాజీ
దాంతో మహేష్బాబు, అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీస్ వార్ ఇక తప్పదు అనే నిర్ణయానికి సినీ వర్గాలు వచ్చేశాయి. స్టార్ హీరోలు అలా పోటీ పడటం ఏ మాత్రం సరికాదు. నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉంది అనే ఉద్దేశంతో సినీ వర్గాలు ఆ సినిమా నిర్మాత మధ్య రాజీ కుదిర్చినట్టు తెలుస్తున్నది.
రిలీజ్ డేట్ల సర్దుబాటు
మెగా హీరో రాంచరణ్ ‘రంగస్థలం' చిత్రాన్ని మార్చి 30న విడుదల చేస్తున్న నేపథ్యంలో మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాను ఏప్రిల్ 13న రిలీజ్ చేయడానికి నిశ్చయించారు. ఆ తర్వాత రెండు వారాల అనంతరం అంటే ఏప్రిల్ 27న రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం.
త్వరలో రిలీజ్ డేట్లపై క్లారిటీ
ఒకవేళ అలా కానీ పక్షంలో ఏప్రిల్ 27న ఏదైనా సినిమా రిలీజ్ అయినట్లయితే రెండు వారాల తర్వాత అంంటే మే 11న మరో సినిమాను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ డేట్ల గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత అధికారికంగా రిలీజ్ డేట్లను వెల్లడించే అవకాశం ఉంది.