twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్తగా ఉంది:మహేష్ బాబు

    By Staff
    |

    Mahesh
    నన్ను సామాన్యంగా ఎవరూ మెప్పించలేరు. అలాంటిది ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంది. ఇలాంటి చిత్రాలకు ప్రోత్సాహం లభిస్తే మరిన్ని మంచి కథలను తెరపై చూడొచ్చు అన్నారు మహేష్. తన సోదరి ఇందిరా ప్రొడక్షన్స్ పై నిర్మించి,నటించిన కావ్యాస్ డైరి చిత్రం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు.

    కావ్యాస్‌ డైరీ విడుదల కాకముందే చూశాను. తెర మీద మంజుల నటన చూసి విస్తుపోయా. 'షో' చిత్రంలో కనిపించిన మంజులేనా అనిపించింది. నటనలో చాలా పరిపక్వత ఉంది. తను సినిమా ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత నాకు ఈ ప్రాజెక్ట్‌ గురించి తెలిసింది.. ఈ కథ, కథనం మొత్తం కొత్తగా ఉంది అన్నారు. అలాగే నేను మామూలుగా బయటి చిత్రాలు చూడను. కావ్యాస్‌ డైరీ రెండో సగం మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది.

    కుర్చీ అంచులో కూర్చుని చూసేంత ఉత్కంఠతకు లోనుచేసింది. సంగీతం, కెమెరా, ప్రతి అంశంలోనూ కొత్తదనం కనిపించింది అన్నారు. అలాగే తన వరుడు చిత్రం గురించి చెపుతూ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమాకు సంబంధించి మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. సినిమా పేరు 'వరుడు'గా ప్రచారంలో ఉంది. కానీ మేమింకా పేరు ఏం పెట్టాలో నిర్ణయించుకోలేదు. సినిమాను ఎప్పుడు విడుదల చేసేది ఇంకో రెండు నెలల్లో ప్రకటిస్తాం. అప్పుడే టైటిల్‌ను కూడా అధికారికంగా వెల్లడిస్తాం అన్నారు.

    తన ప్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ..నా కెరీర్‌లో 'అతిథి' తర్వాత అనుకోకుండా గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు చేస్తున్న సినిమా స్క్రిప్టు పనుల్లో కాస్త జాప్యం జరిగింది. అందుకే విరామం ఎక్కువైనట్టు అనిపిస్తోంది. కానీ కథ పక్కాగా కుదిరింది. తప్పకుండా ఇది మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను. జులైలో మంజుల నిర్మాతగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌ సినిమా ఉంటుందన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X