twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ డైలాగ్స్ పై కాంట్రవర్సీలు..కుళ్లు జోకులు!

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా 'బిజినెస్ మ్యాన్'లోని కొన్ని డైలాగులు కాంట్రవర్సీగా మారాయి. ముఖ్యమంగా 'ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చా' అంటూ మహేష్ బాబు కొట్టిన డైలాగ్ ఆ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ డైలాగ్ పై మహారాష్ట్రీయులు ముఖ్యంగా ముంబై వాస్తవ్యులు ఆగ్రహంగా ఉన్నారు. మహేష్ బాబు డైలాగ్ తమను అవమానించే విధంగా ఉందని మండి పడుతున్నారు. వెంటనే ఆ డైలాగ్ ను తొలగించక పోతే మహారాష్ట్రలో ఆ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

    ఇక పోతే..ఫేస్ బుక్ లో ఈ డైలాగ్ పై కుళ్లు జోకులు పేలుతున్నాయి. ''ఉచ్చ పోయించడానికి మహేష్ బాబు ఏమైనా ముంబైలో సులభ్ కాంప్లెక్స్ కడుతున్నాడా, ఆ వ్యాపారం గానీ మొదలు పెట్టబోతున్నాడా'' అంటూ కామెంట్లు పోస్టవుతున్నాయి. ఏదైతేనేం...ఈ డైలాగుల వివాదం ద్వారా సినిమాకు ఫుల్ పబ్లిసిటీ దక్కుతుందని, ఇది ఒక రకంగా సినిమాకు ప్లస్సవుతుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    మహేష్ బాబు, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

    English summary
    It is heard that a controversy is brewing up in Mumbai. Sources say the line which comes from Mahesh stating he is there to make Mumbai piss is not going well. Buzz is that few groups in Maharashtra and especially Mumbai are not taking this dialogue too sweetly. They are also planning to stage a protest and ensure that 'Businessman' doesn't get screened in Maharashtra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X