Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహదానందంతో విజయయాత్రలో 'దూకుడు' యూనిట్...!
ఇటీవలి కాలంలో సూపర్ హిట్ సినిమాగా పేరు తెచ్చుకున్న' ప్రిన్స్ మహేష్ బాబు 'దూకుడు" అన్ని చోట్లా బాక్సాఫీసు రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఈ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్ గా నిలుస్తుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం గుంటూరు లో 3.5 కోట్లు వసూళ్లు చేసే దిశగా దూసుకు పోతుంది. గుంటూరు ప్రాంతంలోనే ఇది ఒక అద్భుతమైన మొత్తం. ఇప్పటికే దూకుడు సినిమా అన్ని ప్రాంతాల్లో పోకిరి రికార్డులు దాటింది.
ఈ హై వోల్టేజీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో ప్రిన్స్ మహేష్ బాబుతో సమంతా జత కట్టింది. ఈ సినిమా కు శ్రీను వైట్ల దర్శకుడు. ఈ చిత్రంలోని అద్భుతమైన హాస్యం, డ్రామా సెంటిమెంట్ కుటుంభ సమేతంగా ప్రేక్షకులను సినిమా హాల్స్ వద్దకు రప్పిస్తుంది. ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ తో థియేటర్లలో కోలాహలం నెలకుంటుంది. ప్రకాష్ రాజ్, మహేష్ బాబుల మధ్య తండ్రి-కొడుకుల సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది.
కాగా 'దూకుడు' సినిమా యూనిట్ రాష్ట్రంలోని పలు కేంద్రాలలో విజయయాత్ర నిర్వహిస్తోంది. ఈ రోజు (అక్టోబర్ 7) ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు; రేపు విజయవాడ, ఏలూరు, కాకినాడ; ఎల్లుండి రాజమండ్రి, విశాఖలలో ఈ విజయయాత్ర జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. కొంత మంది నటీనటులతో బాటు దర్శక, నిర్మాతలు కూడా పాల్గొంటున్నారు. సినిమాను పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులను స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పడానికే ఈ యాత్ర చేస్తున్నట్టు వారు చెప్పారు. ఇదిలా ఉంచితే, ఈ చిత్రం రెండు వారాలలో 70 కోట్ల 15 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి 80 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో రికార్డు క్రియేట్ చేసిందని నిర్మాతలు చెబుతున్నారు.