Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒకపక్క భయం..మరోప్రక్క నిరాశ...!?
'పోకిరీ' సినిమా తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తో మళ్లీ మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలుసు. 'ది బిజినెస్ మేన్' పేరుతో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. దీనికి 'గన్స్ డోంట్ నీడ్ అగ్రిమేన్ట్స్' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. కాగా, ఈ చిత్రం షూటింగు మే 20 న హైదరాబాదులో ప్రారంభం అవుతుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించే అవకాశం వుంది. కాగా, ఈ చిత్రాన్ని ఏకకాలంలో హిందీలో కూడా నిర్మిస్తారని తెలుస్తోంది. అందులో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తాడనీ, హిందీ వెర్షన్ కి రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తాడనీ సమాచారం.
అలాగే రీసెంట్ గా మణిరత్నం సినిమాలో నటించబోతున్నాడు అని చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు మహేష్ బాబు. కానీ ఈ వార్త విన్న మహేష్ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. ఇప్పటికే మణిరత్నం సంవత్సరాలు తరబడి తీసిన రావన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దీనికి తోడు ఇప్పుడు మహేష్ తో తీయబోయే సినిమా 'పొన్నియన్ సెల్వమ్" నవల ఆధారంగా వందల సంవత్సరాల నాటి చోళుల కధ అంట. ఇప్పటికే ఖలేజా సినిమా గురుంచి సంవత్సరాలు వేచి చూసినా గాని అభిమానులను మెప్పించలేకపోయింది.ఇప్పుడు మణిరత్నం తో సినిమా అంటే అది రిలీజ్ కావడానికి మినిమం రెండు మూడు సంవత్సరాలు పట్టడం ఖాయం. మహేష్ ఫ్యాన్స్ కి తమ హీరో వరుస సినిమాల గ్రీన్ సింగ్నల్ ఇస్తూ పోతుంటే ఒకప్రక్క ఆనందం, మరోప్రక్క భయం, తర్వాత చిత్రాలైనా హిట్ ఇస్తాయోలేదో అనే అయోమయం. ఇప్పటికే మహేష్ బాబు కి బద్ధకం బాగా పెరిగిపోయిందని వార్తలు కూడా వస్తున్నాయి. ట్విటర్ లో ఉన్నంత యాక్టివ్ గా సెట్స్ మీద వుండటం లేదని దర్శకుడు శ్రీను వైట్ల భాదపడుతున్నాడని టాలీవుడ్ టాక్.ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు తెర మీదకి వస్తుందో వేచి చూడాల్సిందే.