Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ కటౌట్ తొలిగింపుపై వృధ్దురాలి నిరసన
హైదరాబాద్ : మహేష్ బాబు వంటి స్టార్ హీరోకు యూత్ లో ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఆయనకు వయస్సు మళ్లిన వృధ్దులలో నూ అభిమానులు ఉన్నారని అర్దమైంది. ఆయన కటౌట్ ని విజయవాడలో తొలిగించటంపై ఓ వృద్దురాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ....కటౌట్ బాగుందని కుళ్లుతో, ఈర్షతో తొలిగించారని విరమ్శించింది. తాను తొలినుంచీ కృష్ణ అభిమానినని ఆ తర్వాత మహేష్ అభిమానిని అని చెప్పింది.
మరో ప్రక్క మహేష్ అభిమానులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. మహేష్ అభిమానులంతా మహేష్ బాబు జిందాబాద్ అనే నినాదాలతో తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తాము ఎంతో అబిమానంతో రూపొందించుకున్న కటౌట్ ను నగరంలో ఎక్కడో చోట నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు.
విజయవాడలోని అలంకార్ థియేటర్ వద్ద అభిమానులు మహేష్బాబు నటించిన 'ఆగడు' సినిమా భారీ కటౌట్ను ఏర్పాటుచేశారు. కటౌట్ను తొలగించేందుకు అధికారులు యత్నించడంతో అభిమానులు ఆందోళన చేపట్టారు. అధికారుల వైఖరికి నిరసనగా ఓ అభిమాని పక్కనే ఉన్న ఏలూరు కాల్వలోకి దూకడంతో స్థానికులు కాపాడారు.
ఆగడు సినిమా ఈ నెల 19న విడుదల కానున్న సందర్భంగా మహేష్ బాబు అభిమానులు 90 అడుగుల కటౌట్ నిర్మించారు. అభిమానులు చందాలు వేసుకొని మూడు రోజుల నుంచి దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ సమయంలో అభ్యంతరం చెప్పని పోలీసు అధికారులు కటౌట్ పూర్తి అయిన తరువాత అనుమతిలేదని, అడ్డుగా ఉందని అభ్యంతరం తెలిపి, దానిని తొలగించారు. దాంతో మహేష్ బాబు అభిమానులు తీవ్ర మనఃస్తాపానికి గురయ్యారు. తీవ్ర నిరసన తెలిపారు.