Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దూకుడు వివాదం: మహేష్ ఫ్యాన్స్ కోటి ఆఫర్
దూకుడు చిత్రం రికార్డుల గొడవ రోజు రోజుకీ ముదురుతోంది. రెండు రోజుల క్రితం చిరు అభిమానులు విజయవాడలో దూకుడు రికార్డులు కరెక్టే అని రుజువు చేస్తే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ అభిమానులు దీనిని సవాలు చేసారు. మగధీర రికార్డులుని దూకుడు క్రాస్ చేయలేదని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తామని ప్రతిసవాల్ చేసారు. అంతేగాక దూకుడు నిర్మాత జిల్లావారి రికార్డులని ప్రకటించాలని డిమాండ్ చేసారు. విజయోత్సవ సభలో దూకుడు నిర్మాత.. దూకుడు నిర్మాతలను తిరిగ రాసిందని ప్రకటించటం వివాదానికి కారణమైంది. రికార్డులంటే మగధీరవే అంటూ అభిమానులు మండిపడుతున్నారు. విజయవాడ అలంకార్ సెంటర్లలో ఈ మేరకు వారు ప్లెక్లీలు పెట్టి వివాదాన్ని మొదలెట్టారు.
ఇంతవరకూ మగధీర రికార్డులను ఏ చిత్రమూ బీట్ చెయ్యలేదని వారు తేల్చి చెప్పారు. కానీ తప్పుడు ప్రకటనలతో దూకుడు నిర్మాతలు మోసం చేస్తున్నారని వారు అంటున్నారు. దమ్ముంటే వసూళ్లను పక్కాగా ప్రకటించాలని వారు అన్నారు. మెగా అభిమానులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ప్రాంతాల వారిగా మగధీర సాధించిన వసూళ్లు వివరాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి చర్చకైనా సిద్దమేనని వారు అంటున్నారు. మరి చివరకు ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.