Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్బాబు నా పేరు చెప్పారనే చేసాను
హైదరాబాద్ : ''మహేష్ నటనంటే నాకు ఇష్టం.'శ్రీమంతుడు' స్క్రిప్టు పనులు జరుగుతున్నప్పుడు ఓ పాత్రకు యంగ్ హీరోని తీసుకొంటే బాగుంటుంది అనుకొన్నారట. అప్పుడు 'అందాల రాక్షసి'లో చేసిన అబ్బాయిని తీసుకొందాం' అని నా పేరు చెప్పారట. ఆ మాట వినగానే ఇంకేం ఆలోచించలేదు. మహేష్ సెట్లో ఎలా ఉంటాడో చూడ్డానికైనా ఈ సినిమా చేయాల్సిందే అనుకొన్నా'' అన్నారు రాహుల్ రవీంద్రన్.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలరించాడు రాహుల్ రవీంద్రన్. 'అలా ఎలా'తో ఓ మంచి విజయాన్ని అందుకొన్నాడు. ఇప్పుడు 'టైగర్' ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. 'శ్రీమంతుడు'లోనూ అతిథి పాత్ర పోషించాడు. రాహుల్ హైదరాబాద్లో మీడియాతో ముచ్చటించాడు.
'టైగర్' గురించి మాట్లాడుతూ... ''స్నేహం, ప్రేమ నేపథ్యంలో సాగే పక్కా వాణిజ్య చిత్రం 'టైగర్'. ఇద్దరబ్బాయిలు, ఓ అమ్మాయి అనేగానే ముక్కోణపు ప్రేమకథ అనుకొంటారు. అయితే మా మూడు పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది చాలా కీలకం అన్నారు.
అలాగే సందీప్కిషన్లాంటి స్నేహితుడితో కలసి నటించడం ఓ మంచి అనుభూతి. 'టైగర్'ని తనే నా దగ్గరకు తీసుకొచ్చాడు. సినిమా బాగా వచ్చింది. 'అలా ఎలా' తరవాత చేస్తున్న సినిమా ఇది. కాబట్టి మరో విజయం సాధించాలన్న తపనతో చేశాము''అన్నారు.